ఈ బాదుడు ప్రభుత్వాన్ని సాగనంపండి !
ప్రజలను పీల్చి పిప్పి చేస్తోన్న ఈ బాదుడు ప్రభుత్వాన్ని ఇక సాగనంపాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తాళ్ల వలస గ్రామంలో ప్రజలతో మాట్లాడారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ విధ్వంసకర వైసీపీ ప్రభుత్వానికి పాలించే అర్హతను కోల్పోయిందన్నారు. ఒక్కసారి అవకాశమిచ్చినందుకు ఏం చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల క్రితం నిత్యావసర సరకులు ఎంత ధరలున్నాయి.. ఇప్పుడెంత పెరిగాయో పరిశీలించాలని కోరారు. పెట్రో, డీజిల్,…