నిధులన్నీ ఎత్తుకెళ్తే మేమేం చెయ్యాలి !
ఏపీలో వింత పరిస్థితి తలెత్తింది. గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను గుట్టుచప్పుడుగాకుండా రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీలో ఉన్న డిపాజిట్లలో రూ.400 కోట్లు తీసేసుకుంది. ఇంకా జీవితా బీమా సంస్థలో అభయ హస్తం కింద ఉన్న వెయ్యి కోట్లను సెర్ప్ కిందకు తీసుకొచ్చింది. ఇంకా ఏఏ శాఖల్లో ఎంతెంత ఉన్నాయో ఆరా తీసి మొత్తం బయటకు లాగి పబ్బం గడుపుకునే పనిలో సర్కారు నిమగ్నమైంది. దీంతో పంచాయతీ సర్పంచులు లబోదిబోమంటున్నారు….