సర్వే పూర్తయితే మూడొంతుల వివాదాలు సమసినట్లే !
ఏపీ సర్కారు చేపట్టిన వైఎస్సార్ జగనన్నశాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం అమలు పూర్తయితే చాలు. రాష్ట్రంలోని మూడొంతుల భూవివాదాలు ఓ కొలిక్కి వచ్చినట్లే. ఏ కోర్టులో చూసినా సివిల్ కేసుల్లో సింహ భాగం భూ వివాదాలే ఉంటున్నాయి. అస్తవ్యస్తమైన రికార్డులు, రెవెన్యూ అరాచకాలతో భూ వివాదాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎక్కడో ఒకచోట చెక్ పెట్టాలని ప్రభుత్వం భావించడం హర్షణీయం. దీనిపై సీఎం జగన్ ఈరోజు అధికారులతో సమీక్షించారు. 2007లో నాటి వైఎస్ సర్కారు…